Monday 17 July 2023

ఈ బడాదీదీ అందరికీ ఆదర్శం

 జీవితం లోని అన్ని సమస్యల్ని పరిష్కరించగలిగేది విద్య,ఎంత చదివితే అంత తెలుస్తుంది.ఎంత తెలిస్తే అంత నేర్చుకుంటావు,అన్ని ప్రదేశాల్ని చూస్తావు అని చెప్పాడు డాక్టర్ సియోస్. బడా దీదీ అనే సంస్థ దీన్ని ఆదర్శంగా తీసుకుంది.2019 వ సంవత్సరం లో 20 మంది ఆదివాసీ మహిళలు మల్కాన్ గిరి జిల్లాలో ఈ సంస్థ ని స్థాపించారు. అక్కడి పిల్లల్లో ఉన్న మొబైల్ ఫోన్ ఎడిక్షన్ ని మానిపించి పుస్తకాల వైపు వారి దృష్టిని మళ్ళించడానికి దీన్ని నెలకొల్పారు.

అక్కడి పల్లెల్లో ఆరుబయట చదువుకునే లైబ్రరీల్ని స్థాపించారు.దాంట్లో కథల పుస్తకాలు,కార్టూన్ ఇంకా అనేక పుస్తకాలు ఉంటాయి.రకరకాల మేగజైన్ లు కూడా ఉంటాయి.పెద్దలు,పిన్నలు కూడా ఇక్కడికి వచ్చి చదువుతుంటారు.దీపావళి పర్వ దినాన 80 పుస్తకాలతో ఈ గ్రంథాలయాన్ని పెట్టారు.ఇంగ్లీష్,ఒడియా,హిందీ,బెంగాలీ పుస్తకాలు కూడా ఉన్నాయి.అవే కాక జి,కె.పుస్తకాలు,పోటీ పరీపరీక్షలకి పనికొచ్చే పుస్తకాలు కూడా ఉన్నాయి.


 రోజు పది నుంచి పదిహేను మంది దాకా పిల్లలు ఈ లైబ్రరీ కి వస్తుంటారు.పొద్దున్న,సాయంత్రం వారి వీలునుబట్టి వస్తుంటారు.ప్రతి పంచాయాత్ లోనూ ఈ తరహా కేంద్రాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు.పిల్లలే గాక పెద్దల్ని కూడా ఇవి ఆకర్షిస్తున్నాయి. అనేకమంది దాతలు కూడా ముందుకు వచ్చి పుస్తకాలు స్పాన్సర్ చేస్తున్నారు.ఇతర రాష్ట్రాలకి చెందిన పుస్తకప్రియులు సైతం ఈ బడదీదీ సంస్థ కి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.  

  ఈ బడదీదీ కి మొత్తం 40 మంది వాలంటీర్లు ఉన్నారు.వీరు అంతా ఆదివాసీ పల్లెలలోనే పనిచేస్తూన్నారు. దీన్ని ప్రారంభించినవారు జయంతి అనే మహిళ.ఈమె కోయ తెగకి చెంది, ఒక పేరెన్నిక గన్న మీడియా హౌస్ లో పనిచేస్తున్నారు.ఈ లైబ్రరీలతో బాటు చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పే కార్యక్రమం కూడా కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా ప్రయత్నిస్తున్నారు.చిత్రకొండ ఏరియా లోని బోండా తెగ ప్రజల కోసం కూడా కృషి చేస్తున్నారు.

      

No comments:

Post a Comment