Thursday 20 April 2023

జావా ఆఫ్ ఇండియా అని ఈ పట్టణాన్ని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

 Java of India అని మన దేశం లో ఏ పట్టణాన్ని పిలుస్తారో తెలుసా..? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న గోరఖ్ పూర్ ని ఆ విధం గా పిలుస్తారు. అంతే కాదు, ఆ పట్టణం ఆధ్యాత్మిక,సిద్ధ పురుషులకి పెట్టింది పేరు. ప్రసిద్ధ నాథ్ సంప్రదాయానికి పట్టుగొమ్మ ఈ స్థలం. మత్స్యేంద్రనాథ్ మహాశయులు స్థాపించిన ఆలయం ఇప్పటినుంచి కాదు ఎన్నో తరాల నుంచి పేరెన్నిక గన్నది.గోర్ఖ్ పూర్ పట్టణం అత్యంత పురాతన పట్టణం.గీతా ప్రెస్ అంటే తెలియంది ఎవరికి.ఆ ప్రెస్ ఇక్కడ నుంచే నడిచేది.


రాప్తీ నదీ తీరాన,లక్నో కి తూర్పున 272 కి.మీ. దూరం లో ఉంటుంది.నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ కి ప్రధాన కేంద్రం కూడా.ఒకానొకప్పుడు బస్తీ,దియోరియొ,అజం ఘడ్,నేపాల్ లోని తరాయ్ వీటన్నిటిని కలిపి ప్రసిద్ధ ఆర్యవర్తం లోని క్షేత్రాలుగా పిలిచేవారు.ఇక్కడకి వచ్చిన వారు కపిలవస్తు,లుంబిని,కుషీనగర్,గోరఖ్ నాథ్ ఆలయం  ఇలాంటివి చూడాలి. చౌరిచౌరా ఘటన లో అమరులైనవారికి స్మారక స్థూపం నిర్మించారు.ఇదీ చూడవలసిందే.

ఇక్కడ హిందీ,ఉర్దూ మాట్లాడుతారు.అలాగే భోజ్ పూరి కూడా. ప్రతిరోజు ఇక్కడినుంచి ఢిల్లీకి 13 రైళ్ళు నడుస్తాయి.బ్రిటీష్ వారు ఈ పట్టణాన్ని హిల్ స్టేషన్ గా పరిగణించారు.నేపాల్ కి బోర్డర్ లో ఉండే పట్టణాల్లో ఇది ఒకటి.అన్నట్టు ఈ ప్రాంతాన్ని జావా ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారో తెలుసా ..? ఇక్కడ ఎక్కువగా చెరుకు మిల్లులు ఉంటాయి.దానివల్లనే ఆ పేరు వచ్చింది. 

No comments:

Post a Comment